Current Date: 24 Sep, 2024

అనంతపురం జిల్లాలో రథం దగ్ధం ఘటనపై దర్యాప్తునకు సీఎం ఆదేశం

 అనంతపురం జిల్లాలో రథం దగ్ధం ఘటనపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. కనేకల్‌ మండలం హనకనహల్‌లో అర్ధరాత్రి ఆలయ రథం దగ్ధమైంది. ఈ ఘటనను చంద్రబాబు ఖండిరచారు. అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఆగంతకులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఘటనపై  సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సీఎం ఆదేశించారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లి విచారణ చేయాలని కలెక్టర్‌, ఎస్పీని కోరారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలన్నారు.

Share