Current Date: 07 Oct, 2024

పోలీసుల కళ్లుగప్పి రిమాండ్‌ ఖైదీ పరారీ

 విశాఖ నుంచి అనంతపురం తీసుకొస్తున్న రిమాండ్‌ ఖైదీ నరేశ్‌ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. రైలులో తీసుకొస్తుండగా బుధవారం అర్ధ రాత్రి  సమయంలో ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద తప్పించుకున్నాడు. నరేశ్‌ స్వస్థలం అనంతపురం జిల్లా గుత్తి మండలం టి.కొత్తపల్లి. గంజాయి రవాణా కేసులో అతడు పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిపై గుత్తి, గుంతకల్లు, ముంబయిలోని పోలీసు స్టేషన్లలో గంజాయి, చోరీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో విశాఖపట్నం సబ్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు.  అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Share