Current Date: 06 Oct, 2024

మారేడుపూడి చెరువుపై దృష్టి సారించాలి

మారేడుపూడి గ్రామంలో చేపట్టిన చెరువు అభివృద్ధి పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని బీజేవైఎం జిల్లా కార్యదర్శి పీతా నానాజీ ఆరోపించారు. 20ఏళ్లగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొంటూ అనకాపల్లి జిల్లా డీఆర్‌డీఏ పీడీకి ఆయన సోమవారం  వినతినిచ్చారు. సర్వే నంబర్‌ 385లో .85ఎకరాల్లో ఎంతో కీలకమైన ఈ చెరువు ఉన్నా లేనట్టే చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి ఎంపీడీవో దృష్టి సారించాలన్నారు. భూగర్భ జలాలు ఇంకిపోతున్న నేపథ్యంలో రెండు దశాబ్ధాలుగా నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోందన్నారు. వచ్చే వర్షాకాలం సీజన్‌కైనా ఈ చెరువు అభివృద్ధి పనులు పూర్తయ్చేలా చూడాలంటూ నానాజీ డీఆర్‌డీఏ అధికారుల్ని కోరారు.

Share