Current Date: 06 Oct, 2024

విశాఖ దక్షిణన్ని అగ్రపథంలో నడిపిస్తా మీడియా తో ఎమ్మెల్యే వంశీకృష్ణ

విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని అగ్రపథంలో నడిపిస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. శివాజీపాలెంలోని ఆయన స్వగృహంలో సోమవారం కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మి దంపతులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించినట్టు నిత్యం ప్రజలతోనే ఉంటామని, ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తామన్నారు. కల్యాణ మండపాలు, రైతుబజార్ నిర్మాణాలు చేపడతామని, పోర్టు యాజమాన్యంతో మాట్లాడి కాలుష్యనియంత్రణకు చర్యలు చేపడతామన్నారు. వెంకటేశ్వరమెట్ట వంటి ప్రాంతాల అభివృద్ధికి పాటుపడతామన్నారు. వైసీపీ అధ:పాతాళానికి వెళ్లిపోవడా నికి సజ్జల, ధనుంజయ రెడ్డి లాంటి వారే కారణమని, సీనియర్లు బొత్స  వంటి  నేతలుండగా జగన్ వారినే సంప్రదించేవారని గుర్తు చేశారు.

Share