Current Date: 30 Sep, 2024

కీరవాణి ‘ఓం నమో నారాయణాయ’ ఆడియోకు పవన్‌ ధన్యవాదాలు

‘ఓం నమో నారాయణాయ’ మంత్రాన్ని సాధారణ ప్రజలు సైతం సులువుగా పఠించేందుకు వీలుగా ఆడియో రికార్డు రూపొందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ధన్యవాదాలు తెలిపారు. తిరుమల మహా ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం భక్తి భావం కలిగిన ప్రతి ఒక్కరికీ తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ఈ ఆవేదన నుంచే ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించినట్లు తెలిపారు. దీక్షకు సంఫీుభావంగా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులతోపాటు ధార్మిక విశ్వాసాలు కలిగిన వారందరూ ఆలయాల్లో పూజలు, హోమాలు, భజనలు చేస్తున్నారని వివరించారు. దీక్షలు, పూజలు చేసే వారంతా ఓం నమో నారాయణాయ మంత్రం పఠిస్తున్నారని.. వారికి ఉపయోగపడేలా కీరవాణి ఆడియో రికార్డు చేశారని కితాబిచ్చారు. ఈ గీతమంతా భక్తి భావంతో సాగిందని.. ఇందులో భాగస్వాములైన సంగీత కళాకారులు, సాంకేతిక నిపుణులకు పవన్‌ ధన్యవాదాలు తెలిపారు.

Share