Current Date: 30 Sep, 2024

హోబెల్‌ బెల్లోస్‌లో ‘వరల్డ్‌ ఫస్ట్‌ పేపర్‌ పాలెట్‌’

విశాఖలో మరో కొత్త ఆవిష్కరణ జరిగింది. స్వచ్ఛభారత్‌లో భాగంగా ఇక్కడి వీఎస్‌ఈజెడ్‌లో ఉన్న ‘హోబెల్‌ బెల్లోస్‌’ సంస్థ ‘వరల్డ్‌ ఫస్ట్‌ పేపర్‌ పాలెట్‌’ను ప్రవేశ పెట్టింది. 100శాతం రీసైకిలబుల్‌ ప్యాకేజీంగ్‌ సిస్టం అంటూ పునరుత్పాదక పద్దతిలో ఇలా చేసినట్టు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఫుడ్‌ గ్రేడ్‌ గ్లూ పులిసిన తర్వాత ఇలా అవుతుందన్నారు. వీఎస్‌ఈజెడ్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్‌ సోమవారం ఈ ప్రాడెక్ట్‌ను లాంచ్‌ చేశారు. దీనివల్ల పర్యావరణ పరిరక్షణ సులభం అవుతుందన ఆయన ‘హోబెల్‌ బెల్లోస్‌’ సేవల్ని కొనియాడారు.   

Share