Current Date: 06 Oct, 2024

నాకు జీతభత్యాలు వద్దు.. టీడీపీ ఎమ్మెల్యే గొప్ప మనసు!

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాసన సభ్యుడిగా తనకు వచ్చే జీతం, అలెవెన్సులను ఏడాది పాటు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చేస్తానని ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.ఎమ్మెల్యే అవకముందు సివిల్స్‌కు సంబంధించిన కోచింగ్ సెంటర్‌ను కొలికపూడి శ్రీనివాసరావు నిర్వహించారు. అమరావతి ఉద్యమం మొదలైన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టి.. ఉద్యమానికి మద్దతు తెలిపారు. అనంతరం 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి.. తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 21,874 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అక్కడ వైసీపీ తరఫున నలగట్ల స్వామిదాసు పోటీపడ్డారు.

Share