Current Date: 07 Oct, 2024

ఆ డైరెక్టర్‌తో నా కెరీర్‌ నాశనం బాధపడిన రాశి

చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్రసీమలో అడుగుపెట్టిన హీరోయిన్ రాశి జగపతి బాబు హీరోగా నటించిన శుభాకాంక్షలు మూవీ తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సైడ్ క్యారెక్టర్ చేసినప్పటికీ యూత్ ను ఆకట్టుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత  సైతం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ హిట్ తర్వాత రాశి వెనుకకు చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది తెలుగు , తమిళ్ , కన్నడ ఇలా పలు భాషల్లో దాదాపు 100 సినిమాల వరకు చేసింది. ఇదే క్రమంలో కొత్త హీరోయిన్ల ఎంట్రీ తో రాశి కి ఆఫర్స్ తగ్గడం స్టార్ట్ అయ్యాయి. అయినప్పటికీ ఐటెం సాంగ్స్, విలన్ గా కూడా పలు సినిమాలు చేసింది. ఇటీవల బుల్లితెర కు ఎంట్రీ ఇచ్చి పలు సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది.ఓ ఇంటర్వ్యూ లో డైరెక్టర్ తేజపై రాశి సంచలన వ్యాఖ్యలు చేసింది. తేజ –మహేష్ బాబు కలయికలో నిజం మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ లో గోపీచంద్ విలన్ గా నటించగా..రాశి కూడా విలన్ పాత్ర చేసింది. ఈ పాత్ర చేయడం వల్ల తన సినీ కెరీర్ నాశనం అయ్యిందని తాజాగా చెప్పుకొని బాధపడింది. ఈ మూవీలోని మల్లి క్యారెక్టర్ కారణంగా తాను ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని.. ఇందులో గోపీచంద్‌తో పరిమితికి మించి రొమాంటిక్ సీన్లలో నటించడం కొంప ముంచిందని రాశి పేర్కొంది. 

 

Share