Current Date: 06 Oct, 2024

బాలికను కాపాడిన జీవీఎంసీ బీచ్‌ లైఫ్‌ గార్డులు

సముద్రంలో మునిగిపోతున్న ఓ బాలికను జీవీఎంసీ బీచ్‌ లైైఫ్‌ గార్డులు రక్షించారు. ఈ మేరకు గార్డుల్ని ఓ ప్రకటన ద్వారా జీవీఎంసీ కమిషనర్‌ సీఎం సాయి కాంత్‌ వర్మ అభినందించారు. రాంనగర్‌కు  చెందిన సుధా (16) అనే బాలిక స్నేహితులతో కలిసి ఆదివారం ఆర్కేబీచ్‌కు వెళ్లింది. ఆటవిడుపుగా సముద్రంలో స్నానానికి దిగగా, అలల తాకిడికి లోపలికి వెళ్ళిపోతున్న బాలికను గుర్తించిన జీవీఎంసీ  లైఫ్‌ గార్డులు ఆనంద్‌, వాసు, అచ్చన్నలు రక్షించారు. అనంతరం బాలికను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో బీచ్‌ సందర్శకులు లైఫ్‌గార్డుల్ని అభినందించారు. విహార యాత్రికులు, నగర ప్రజలు నిత్యం తీరానికి వస్తుంటారని, సముద్రంలో ప్రమాదాలకు గురి కాకూడదనే భావనతో జీవీఎంసీ  హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని కమిషనర్‌ గుర్తు చేశారు..

Share