Current Date: 04 Jul, 2024

త్వరలోనే మహిళలకు ఉచిత ప్రయాణం

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని త్వరలోనే కల్పించనున్నట్లు  రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల  శాఖ మంత్రి మండి పల్లి రాంప్రసాద్‌ రెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం  బాధ్యతలు  చేపట్టారు. రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగావచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణకుంభం తోను, అధికారులు పుష్ప గుచ్చాలను అందజేస్తూ ఘన స్వాగతం పలికారు. ప్రకాశం జిల్లా దర్శిలో రూ.18.51 కోట్ల అంచనా వ్యయంతో డ్రైవింగ్‌ శిక్షణ, రీసెర్చ్‌ సంస్థను ఏర్పాటు చేసే ఫైలుపై మంత్రి తొలి సంతకం చేశారు.

Share