Current Date: 04 Jul, 2024

ఇంద్రకీలాద్రికి అమరావతి రైతుల పాదయాత్ర

రాజధాని ప్రాంత రైతులు విజయవాడ ఇంద్రకీలాద్రికి పాదయాత్ర చేపట్టారు. అమరావతి రూపకర్త చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పాటు రాజధాని ఉద్యమం విజయం సాధించడంతో కనకదుర్గమ్మ ఆలయానికి అమరావతి ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించారు. ఆదివారం తెల్లవారుజామున తుళ్లూరు శిబిరం నుంచి రైతులు, మహిళలు పొంగళ్లు తయారు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఇంద్రకీలాద్రికి కాలి నడకన బయల్దేరారు. ఉదయం 11 గంటలకు ఆమ్మవారి ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించారు.

Share