Current Date: 07 Oct, 2024

కర్ణాటక సీఎమ్ సిద్ధరామయ్య భార్యపై కేసు ముడా స్కామ్‌లో ఆమెకు సంబంధముందంటూ ఫిర్యాదు

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA)కుంభకోణం కర్ణాటక లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య  భార్య పార్వతి ఈ స్కామ్ ద్వారా భారీ లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైసూరులోని విజయనగర్ పోలీస్ స్టేషన్‌లో సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ కంప్లైంట్ ఇచ్చారు.సిద్ధరామయ్య భార్య, ముడా అధికారులు, ఇతర పరిపాలనా అధికారులు ముడా భూకేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని స్నేహమయి ఫిర్యాదులో పేర్కొన్నారు

Share