Current Date: 05 Oct, 2024

ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజుపై అనర్హత వేటు

ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు పడిరది. ఈ మేరకు సోమవారం శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు ఉత్తర్వులు జారీ చేశారు.ఎస్‌.కోటలో వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావును, విశాఖ లోక్‌సభ అభ్యర్థి బొత్స రaాన్సీ లక్ష్మిని ఓడిరచేందుకు యత్నించారని, ఇందుకోసం టీడీపీతో కలిసి పని చేశారని వైసీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో రఘురాజుపై చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో వైసీపీ విప్‌ పాలవలస విక్రాంత్‌ ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 27న రావాలని మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు తాఖీదులు పంపినా రఘురాజు డుమ్మా కొట్టారు. ఈనెల 31న ఆఖరిసారిగా మరో అవకాశం ఇవ్వగా అనారోగ్యం అని చెప్పి విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలో తాజాగా రఘురాజుపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది.