Current Date: 04 Jul, 2024

చిన్ననాటి స్నేహితులే రెండు రాష్ట్రాలకు డీజీలు!

 ఒకప్పటి స్నేహితులే ఇప్పుడు రెండు రాష్ట్రాలకు పోలీస్ బాస్లయ్యారు. ఆ చిన్ననాటి స్నేహితులే ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఒకరు, పుదుచ్చేరి డీజీపీ శ్రీనివాస్. ఈ ఇద్దరూ గుంటూరులోని కృష్ణానగర్ ప్రైమరీ స్కూల్, శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో చదువుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్సీయూ)లో పీజీ పూర్తి చేశారు. ఆ తర్వాత సివిల్స్ రాసి తిరుమల రావు ఏపీ, శ్రీనివాస్ జమ్ముకశ్మీర్ కేడర్కు వెళ్లిపోయారు. వీరిద్దరూ ఒకే సమయంలో రెండు రాష్ట్రాలకు డీజీపీలుగా ఎంపిక కావడంతో వారి మిత్ర బృందాల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కాలం ఎంత విచిత్రమో కదా

Share