Current Date: 04 Jul, 2024

ఘనంగా ఒలింపిక్ డే రన్

అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా 'ది ఒలింపిక్ అసోసియేషన్' ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో ఆదివారం ఘనంగా ఒలింపిక్ రన్ నిర్వహించారు. కార్యక్రమాన్ని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే, భారత వాలీబాల్ సమాఖ్య ఉపాధ్యక్షుడు గణబాబు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి రన్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో క్రీడలకు మంచి రోజులు రాబోతున్నాయన్నారు. ఏపీలో క్రీడా మౌలిక వసతులు కల్పించడంతో పాటు, ప్రతిభ ఉన్న క్రీడాకారులకు తగిన ప్రాధాన్యత, గౌరవం లభిస్తుందన్నారు. అనంతరం అంతర్జాతీయ క్రీడాకారులు, వివిధ కేంద్ర క్రీడా సంఘాల ప్రతినిధులు కలిసి గణబాబును సత్కరించారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ విశాఖ అధ్యక్షుడు ప్రసన్నకుమార్, ప్రధాన కార్యదర్శి కంచరాన సూర్యనారాయణ, డీఎల్డీవో జూన్ గేలియట్, శాయ్ ట్రైనింగ్ సెంటర్ అడ్మిన్ ఇన్చార్జి, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ. వెంకటేశ్వర్లు, అర్జున్ అవార్డీ జయరాం, అర్జున అవార్డు గ్రహీత నీలంశెట్టి లక్ష్మి, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Share