Current Date: 04 Jul, 2024

నర్సీపట్నంలో పట్టపగలే చోరి

నర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యన్న కాలనీలో పట్టపగలే చోరీ జరిగింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువా పగలగొట్టి ఐదు తులాల బంగారం దొంగలు ఎత్తుకు పోయారు. ఈ మేరకు బాధి త కుటుంబం ఫిర్యాదు చేసినట్లు  టౌన్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. సూరిశెట్టి వెంకటరమణ అనే వ్యక్తి కుటుంబంతో సహా పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో  ఉదయం కుటుంబ సభ్యులు వ్యాపారానికి వెళ్లి  ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం బద్దలు కొట్టి , బీరువాలో నగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం  టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. పట్టి పగలే చోరి జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Share