Current Date: 04 Jul, 2024

మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ

 విశాఖపట్నం ఎన్‌సీసీ గ్రూప్‌ హెడ్‌ క్వార్టర్స్‌, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) విశాఖపట్నం జోనల్‌ యూనిట్‌ సభ్యులు సంయుక్తంగా ఆర్‌కె బీచ్‌ నుండి వైఎంసీఏ బీచ్‌ వరకు మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.  ఈ కార్యక్రమంలో మేజర్‌ టి.బ్రహ్మానందరెడ్డి, లెఫ్టినెంట్‌ జె.రామారావు, ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ డీఆర్‌ బి.ఆర్‌.ఎస్‌ లక్ష్మణ్‌ రెడ్డి, లెఫ్టినెంట్‌ సంజయ్‌ కుమార్‌ ఇతర   సిబ్బంది  300 మందికి పైగా   ఎన్‌సీసీ క్యాడెట్లు   పాల్గొన్నారు.

Share