Current Date: 05 Oct, 2024

రామోజీరావుకు వెంకయ్య నాయుడు నివాళి...

మీడియా దిగ్గజం రామోజీ రావుకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎక్స్ వేదికగా సంతాపం తెలియజేశారు. రామోజీరావు వ్యక్తి కాదు, శక్తిమంతమైన వ్యవస్థ. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన వారి జీవితం నుంచి యువతరం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు వారందరికీ రామోజీరావు గర్వకారణం అని వెంకయ్య నాయుడు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.