Current Date: 04 Jul, 2024

మచిలీపట్నంలోనూ అలజడి

కృష్ణాజిల్లా మచిలీపట్నం పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో అధునాతన సదుపాయాలతో నిర్మాణం పూర్తి కావొచ్చిన వైసీసీ కార్యాలయం పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడి మున్సిపాలిటీలో మూజువాణి ఓటుతో పోలీసు గ్రౌండ్ లోని రెండు ఎకరాల స్థలంలో వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణం చేపట్టారు. నిజానికి ఈ భూమి పోలీసు శాఖది. పోలీసు శాఖపై ఒత్తిడి తెచ్చి.. పురసాలక సంఘం పాలక మండలి అనుమతితో ఈ నిర్మాణం చేపట్టారు. ఈ భూమిపై నిజానికి పురపాలక సంఘానికి అధికారం లేదు. పైగా 99 తొమ్మిదేళ్లు లీజుకు ఇస్తూ పురపాలక సంఘం పాలక మండలి ఆమోదం తెలనటం అభ్యంతరకరమని అప్పట్లో టీడీపీ వాదించింది. కానీ అధికార బలంతో ఈ భూమిని వైసీపీ స్వాధీనం చేసుకుంది. ఇదే స్థలంలో ప్రజలకు ఉపయోగపడే రీతిలో భోగరాజు సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి యూనియన్ బ్యాంకు ముందుకు వస్తే భూమి ఇవ్వలేదు. ఈ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎంపీ బాలశౌరి కృషి చేశారు. కానీ బాలశౌరిపై వ్యతిరేకతతో అప్పటి ఎమ్మెల్యే పేర్నినాని అడ్డుకున్నారు. ఈ స్థితిలో బందరు పోలీసు పేరేడ్ గ్రౌండ్ లో వెలిసిన వైసీపీ కార్యాలయంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు సమాచారం.

Share