Current Date: 04 Jul, 2024

విశాఖ సీపీ రక్తదానం

 విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ రక్తదానం చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఇక్కడి పోలీస్ రీజినల్ ఆస్పత్రిలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఏ.ఎస్ రాజా, కేజీహెచ్ బ్లడ్ బ్యాంకులు సంయుక్తంగా నిర్వహించిన ఈ శిబిరంలో సీపీతో పాటు పోలీస్ శాఖకు చెందిన 75మంది రక్త దానం చేశారు. సీపీ మాట్లాడుతూ రక్తదానం చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో జేసీపీ కె. ఫకీరప్ప, డ్రగ్ ఇన్స్పెక్టర్లు కె. కల్యాణి, డాక్టర్ ఎం.శ్రీనివాసరావు, పెథాలజిస్టు డాక్టర్ ఎ. సుగంధి, డాక్టర్లు పద్మజ, పోలీసులు పాల్గొన్నారు.

 

Share