Current Date: 04 Jul, 2024

నలుగురు ఐఏఎస్ కు పోస్టింగ్లు

ఏపీలో మరో నలుగురు ఐఏఎస్లకు పోస్టింగ్లిచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వయోజన విద్య డెరెక్టర్గా ఉన్న నిధిమీనాను ఇంటర్ విద్య విభాగానికి (ఎఫ్ఎసీ) పంపించారు. అదే విధంగా సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డ్కెరెక్టర్గా ఉన్న బి. శ్రీనివాసరావును స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ (ఎఫ్ఎసీ)గా నియమించారు. పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ యువరాజ్ను మైన్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఎఫ్ఎసీ)గా నియమించారు. ఏహెచ్ఎ కార్యదర్శిగా ఉన్న ఎంఎం నాయకు ఏపీడీడీసీఎఫ్ ఎండీ (స్పెషల్ ఆఫీసర్, ఎఫ్ఎసీ)గా నియమించారు.

 

Share