Current Date: 04 Jul, 2024

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు

 సీఎం చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, సామాన్య ప్రజలను కలిసేందుకు ఆయన సమయం ఇవ్వాలని గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబును వందల మంది ప్రజలు, కార్యకర్తలు కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. పార్టీ కార్యాలయం గేటు వద్ద నుంచి బారులు తీరి ఉన్న ప్రజల వద్దకు వెళ్లి చంద్రబాబు వినతులు స్వీకరించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

Share