Current Date: 04 Jul, 2024

ఎట్టకేలకు మల్లికార్జున ఔట్

వైసీపీ కార్యకర్తగా వ్యవహరించి అనేక అక్రమాలకు, అవినీతి కి పాల్పడ్డ విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున కు ఎట్టకేలకు బదిలీ అయ్యింది. ప్రభుత్వం మల్లికార్జునకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా జిఏడీ కి పంపింది.  ప్రస్తుత జాయింట్ కలెక్టర్ మయూర్ కు కలెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది.గత మూడేళ్లగా విశాఖ లోనే తిష్ట వేసుకుని కూర్చున్న మల్లికార్జునపై అనేక భూ కుంభకోణాలకు సంబంధించిన ఆరోపణలు వున్నాయి. కలెక్టర్ గా, వీఎంఆర్డీఏ కమీషనర్ గా జోడు పదవులతో అనేక అవినీతి వ్యవహారాలకు మల్లికార్జున కేంద్ర బిందువుగా వుండి గతం ఏ కలెక్టర్ కూ లేని చెడ్డ పేరును మూట గట్టుకున్నారు.  గత సీఎం జగన్ అండచూసుకొని మల్లికార్జున  అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారు. మల్లికార్జున పని చేసిన కాలంలో చేసిన పనులపై విచారణ జరిపించాలని చాలా కాలంగా దళిత నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Share