Current Date: 04 Jul, 2024

తుది విడతలో మరో 18మంది ఐఏఎస్‌లకు బదిలీ

ఏపీలో భారీగా కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఇటీవలే 18మంది ఐఏఎస్‌లకు స్థాన చలనం కలిగించిన ప్రభుత్వం శనివారం వివిధ జిల్లాల కలెక్టర్లనూ మార్చేసింది. రెండు జిల్లాలకు అక్కడి జేసీల్ని ఇన్‌చార్జిలుగా వ్యవహరించాలని ఆదేశించింది. విశాఖ కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున సహా మొత్తం ఆరుగురు కలెక్టర్లను సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 
. విజయనగరం జిల్లా కలెక్టర్‌ ఎస్‌. నాగలక్ష్మిని గుంటూరు కలెక్టర్‌గా నియమించారు. 
. గుంటూరు కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశాలు
. విశాఖ కలెక్టర్‌ మల్లికార్జునను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశాలు, జాయింట్‌ కలెక్టర్‌కు ఎఫ్‌ఏసీగా అవకాశం
. ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ఎ.దినేష్‌కుమార్‌కు అల్లూరి జిల్లా కలెక్టర్‌గా బదిలీ

Share