Current Date: 07 Oct, 2024

టైటానిక్‌లా బీజేపీ మునగాలంటే మోదీయే బెస్ట్ సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్య

ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో రెండుచోట్ల మాత్రమే గెలిచి,పది స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించచడం బీజేపీ బీటలు వారుతోందని ఫలితాలు వెల్లడిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీపై, బీజేపీపై  పార్టీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలపై సామాజిక అనుసంధాన ఎక్స్ వేదికగా ఆయన  స్పందించారు. ‘బీజేపీలో ఉన్న మనం మన పార్టీ టైటానిక్ షిప్ మాదిరిగా మునిగిపోవాలని కోరుకుంటే, అందుకు సారథ్యం వహించడానికి నరేంద్రమోదీయే ఉత్తమమైనవాడు. బీజేపీ శాశ్వతంగా మునిగిపోయేలా బీటలు వారుతోందని ఉపఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి’ అని పేర్కొన్నారు.వివిధ రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి రెండు స్థానాల్లో విజయం సాధించగా. ఇండియా కూటమి పదిచోట్ల గెలిచింది. ఒకచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇందులో ఎక్కువ సీట్లు ఇండియా కూటమి అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఉన్నాయి.

Share