Current Date: 07 Oct, 2024

పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని, నిఘా వర్గాల హెచ్చరిక

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. వివిధ వర్గాల సమాచారం అదే అనుమానాలు కల్గిస్తోందని సాక్షాత్తూ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడం కలకలం రేపుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారూ మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. పూర్తి వివరాలు ఇప్పుడే వెల్లడించలేం ఇదీ కేంద్ర నిఘా వర్గాలు పవన్ కళ్యాణ్ కు చేసిన సూచనలు. ఈ సూచనలే ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా పవన్ అభిమానుల్లో ఆందోళన రేపుతున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల్లో రెగ్యులర్ ట్రాకింగ్ లో కొన్ని అసహజమైన, అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినట్టుగా కేంద్ర నిఘా విర్గాలు తెలిపాయి. అందుకే పవన్ హత్యకు కుట్ర జరగవచ్చనే అనునానాలు వ్యక్తమౌతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ కు నిఘా వర్గాలు సూచించినట్టు తెలుస్తోంది.అటు కేంద్రంలో ఇటు ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలో వచ్చేందుకు కీలక వ్యక్తిగా మారి ప్రధాని మోదీకు సన్నిహితంగా ఉండటంతో మోదీ వ్యతిరేక శక్తుల దృష్టిలో పవన్ కళ్యాణ్ పడినట్టు నిఘా వర్గాల సమాచారం.

 

 

Share