Current Date: 02 Jul, 2024

మీ నాయకత్వంలో పార్టీ మరెన్నో విజయాలు సాధిస్తుంది

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాసరావుకి ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. సమర్థ నాయకత్వంలో పార్టీ మరెన్నో విజయాలను సాధిస్తుందని, మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలాగే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పల్లాకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు పల్లా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి ప్రభుత్వంలో భాగం చేయడమే ప్రధాన కర్తవ్యంగా పనిచేస్తానన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని తెలిపారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Share