Current Date: 04 Jul, 2024

రైలు ఢీకొని బిచ్చగాడి మృతి శరీర భాగాల్ని ఈడ్చుకుపోయిన కుక్కలు

 రైలు ఢీకొని బిచ్చగాడు మృతి చెందిన సంఘటన పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివా రం ఉదయం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పరవాడ, పిట్టవానిపాలెం తదితర ప్రాంతాల్లో బిచ్చమెత్తుకు తిరిగే గుర్తు తెలియని వ్యక్తి (50) శనివారం రాత్రి నుంచి కనిపించలేదు. ఆదివారం ఉదయం రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడని సమాచారం అందడంతో ఆచూకీ కనుగొనేం దుకు స్థానికులు ప్రయత్నించారు. ఊరి చివరి ఆలయం వెనుక ఉన్న రైల్వే ట్రాక్పై శరీరం ఛిద్రమై కనిపిచింది. అంతేకాకుండా మృతుడి శరీర భాగాల్కెన చేతిని కుక్కలు పట్టుకుపోయి తుప్పల్లోకి విసిరేశాయి. మృతి చెందింది బిచ్చగా డని, అతడు అనాథని ఆ తర్వాత తేలింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

 

Share