Current Date: 05 Oct, 2024

రామోజీ మృతి దిగ్భ్రాంతి కలిగించింది: జగన్‌

రామోజీరావు మృతి తనకు దిగ్భ్రాంతి కలిగించిందని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా దిగ్గజం రామోజీరావు మరణం బాధించిందని,  తెలుగు పత్రికా రంగానికి ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని, రామోజీ కుటుంబానికి తప ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాన’నంటూ జగన్‌ ట్వీట్‌ చేశారు.