Current Date: 07 Oct, 2024

తాండవ రిజర్వాయర్ లో పెరుగుతున్న నీటిమట్టం

అనకాపల్లి జిల్లాలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు గా ఉన్న తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టులో వరద నీరు చేరుతున్నది. ఇటీవల వరకు నీటిమట్టం పడిపోయిన తాండవ రిజర్వాయర్లో  భారీ వర్షాలకు క్రమేపి నీటిమట్టం పెరుగుతున్నది. ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 380 అడుగులు. ప్రస్తుతం 364 అడుగులకు నీటిమట్టం పెరిగింది. భారీ వర్షాలు కారణంగా రోజుకి 750 క్యూసెక్కుల వరదనీరు రిజర్వాయర్ లోకి వచ్చి చేరుతున్నది. భారీ వర్షాలకు రిజర్వాయర్ లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.

Share