Current Date: 04 Jul, 2024

ఏపీ నెక్ట్స్ సీఎంపై కేసీఆర్ జోస్యం.. మొదలైన రగడ

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి జగనే అధికారంలోకి రావొచ్చన్నారు బిఆర్ఎస్ అధినేత , తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. మంగళవారం రాత్రి ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో పాల్గొన్న ఆయన..అనేక విషయాలపై క్లారిటీ ఇస్తూ..ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాదించబోతున్నారు..? కూటమి విజయం సాధిస్తుందా..? మీ చిరకాల మిత్రుడు జగన్ గెలవబోతున్నారా..? అనే ప్రశ్నకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు.

ఏపీలో జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారనే సమాచారం అందుతుందని కేసీఆర్ వెల్లడించారు. ‘ఏదొక పార్టీకి నేను వత్తాసు పలకడం సరికాదు. వాళ్ల రాజకీయాలు వాళ్లు చేసుకుంటున్నారు. నాకు అందే సమాచారం ప్రకారం జగనే గెలుస్తారు. ఎవరు గెలిచిన మాకేం సంబంధం లేదు..ఈ సమయంలో నేను ఓ పార్టీ కి వత్తాసు పలకడం అంత మంచిది కాదు. ఏపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి జోక్యం చేసుకోదు. భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో ఆలోచిద్దాం’ అని కేసీఆర్
క్లారిటీ ఇచ్చారు.

కేసీఆర్ కామెంట్స్‌ను వైసీపీ తమకి అనుకూలంగా ప్రచారం చేసుకుంటుండగా.. టీడీపీ కౌంటర్ ఇస్తోంది. వాస్తవానికి కేసీఆర్, జగన్ మధ్య గత పదేళ్లుగా మంచి సాన్నిహిత్యం ఉంది. అలానే ఓటుకి నోటు కేసు నేపథ్యంలో చంద్రబాబు, కేసీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. దాంతో కేసీఆర్ కామెంట్స్‌ ఎవరినీ పెద్దగా ఆశ్చర్యపరచలేదు.