Current Date: 06 Oct, 2024

మరికొన్ని గంటల్లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్.. కీలక ఆటగాడికి ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇచ్చిన పాక్...

టీ20 వరల్డ్ కప్ 20254లో నేడు హైవోల్టేజీ క్రికెట్ సమరం జరగనుంది. దాయాది దేశాలైన భారత్ -పాకిస్థాన్ న్యూయార్క్ వేదికగా తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కాగా భారత్‌తో మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు పాకిస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్ స్టార్ ఆల్‌రౌండర్ ఇమాద్ వాసిమ్‌కు ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇచ్చింది. కుడి పక్కటెముక ఇబ్బంది కారణంగా అమెరికాతో మ్యాచ్‌కు దూరమైన అతడు ఫిట్‌నెస్ పరీక్షలో పాసయ్యాడని ఆ జట్టు హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ వెల్లడించాడు. భారత్‌తో మ్యాచ్‌ నేపథ్యంలో జట్టు ఎంపికకు ఇమాద్ వాసిమ్ అందుబాటులో ఉంటాడని నిర్ధారించాడు.

Share