Current Date: 02 Jul, 2024

పెళ్లయిన అమ్మాయితో అదీప్ రాజ్ లవ్ స్టోరీ

పెందుర్తి నుంచి వైసీపీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలైన అదీప్‌ రాజ్‌ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భర్తతో విడిపోయిన ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సమస్యల్లో చిక్కుకున్న అదీప్‌ రాజ్‌ చివరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పులగానిపాలెం ప్రాంతానికి చెందిన భార్యభర్తలు తమ తగవును తీర్చమని అదీప్‌ రాజ్‌ దగ్గరకు వెళ్లారు. అయితే వారికి కౌన్సెలింగ్‌ చేసిన అదీప్‌ రాజ్‌ వాళ్లిద్దర్నీ ‘విడిపోవాలని’ తీర్పు చెప్పి పంపించేశారు. అందంగా ఉన్న ఆ వివాహితను ఆ తర్వాత తన మార్గంలోకి తెచ్చుకుని, పెళ్లి చేసుకుంటానని కూడా అదీప్‌ రాజ్‌ నమ్మబలికారు. దీంతో ఆమె అదీప్‌ రాజ్‌తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోందని తెలిసింది. తరువాత ఆమె తనను పెళ్లి చేసుకోవాలని అదీప్‌పై ఒత్తిడి చేసింది.  ఎన్నికల ముందు ఆమె తన ఒత్తిడిని  మరింత తీవ్రతరం చేసింది. దీంతో దాదాపు రూ.50లక్షల వరకు ఆమెకు ఇచ్చి అప్పటికి నోరుమూయించారని సమాచారం. అయినా ఆమె బాధ పడలేక ఎన్నికల తర్వాత లోపాయికారీగా పెళ్లి కూడా చేసుకున్నట్టు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న అదీప్‌ రాజ్‌ భార్య ఆయన్ను నిలదీయడంతో సమస్య మరింత జఠిలమైంది. 

Share