Current Date: 07 Oct, 2024

యువతి ప్రాణం తీసిన ట్రైయాంగిల్ లైవ్ స్టోరీ!

తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వేంధిపులకు ఓ అమాయకపు యువతి బలైంది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయటంతో పాటు ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించటంతో మనస్థాపం చెంది సూసైడ్ చేసుకుంది.నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన కొత్త రామలింగం, రజితల కుమార్తె కొత్త కళ్యాణి (19). పాలిటెక్నిక్ పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటుంది. అయితే అదే గ్రామానికి చెందిన అరూరి శివ, కొమ్మనబోయిన మధు అనే ఇద్దరు యువకులు ఆమెను ప్రేమ పేరుతో వేధింపులకు గురు చేస్తున్నారు. తనను ప్రేమించాలంటూ ఎవరికి వారే కళ్యాణిని వేధింపులకు గురి చేయటం మెుదలు పెట్టారు. ప్రేమించకుంటే నీ ఫోటోలను వాట్సాప్, ఇన్‌స్టా డీపీలుగా పెట్టుకుంటామని.. సోషల్ మీడియాలో షేర్ చేస్తామని ఆమెను బెదిరించారు.ఈనెల 6న తిప్పర్తి మండల పరిధిలో వారి బంధువు చనిపోవటంతో తల్లిదండ్రులు అక్కడికి వెళ్లారు. కళ్యాణి తమ్ముడు కాలేజీకి వెళ్లగా.. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంది. ఇదే అదునుగా శివ, మధు ఆమెకు పలుమార్లు ఫోన్లు చేశారు. ప్రేమించాలంటూ ఆమెను వేధింపులకు గురిచేశారు. 

Share