Current Date: 02 Jul, 2024

వారానికి ఐదు రోజుల పని మరో ఏడాది పొడిగింపు

సచివాలయం శాఖాధిపతుల కార్యాలయాల్లో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వ పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ గురువారం ఉత్తర్వులిచ్చారు. వారానికి ఐదురోజుల పని విధానాన్ని ఈ ఏడాది జూన్‌ 27వ తేదీ నుంచి ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదురోజుల పని విధానంలో ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలకు వరకు పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Share