Current Date: 06 Oct, 2024

సైలెంట్‌గా హీరోయిన్ ఎంగేజ్‌మెంట్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్!

క్రేజీ హీరోయిన్ మేఘా ఆకాష్ సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసేసుకుంది. టాలీవుడ్‌ ప్రేక్షకులకు 2017 లో 'లై' సినిమాతో పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ   సాయి విష్ణుని వివాహం చేసుకోబోతుంది. సాయి విష్ణుతో మేఘా ఆకాష్ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉంది.   తమిళనాడుకు చెందిన మేఘా ఆకాశ్  నితిన్‌‌కి జోడీగా లైలో నటించి మెప్పించింది. ఆ సినిమా నిరాశ పరచినా కూడా వెంటనే మరోసారి నితిన్‌‌తోనే చల్‌ మోహన్‌ రంగ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా కూడా నిరాశ పరచడంతో ఇక టాలీవుడ్‌ నుంచి అవకాశాలు తగ్గాయి.  దాంతో కోలీవుడ్‌కి షిప్ట్ అయిపోయింది.  సాధారణంగా హీరోయిన్స్ వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో పెళ్లికి ఓకే చెప్పరు. కానీ మేఘా ఆకాష్ మాత్రం సర్‌ప్రైజింగ్‌‌గా వరుస సినిమాలు చేస్తున్న సమయంలో పెళ్లికి ఓకే చెప్పి ఆశ్చర్యపరిచింది.  ఇద్దరి జోడీ చూడముచ్చటగా ఉందని కామెంట్స్ చేస్తూ శుభకాంక్షలు తెలియజేస్తున్నారు.

Share