Current Date: 23 Sep, 2024

కార్పెంటర్ దారుణ హత్య

వినాయకుని ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో  సినిమా తరహాలో వెంటాడి వేటాడి కత్తులతో దాడి చేసి కార్పెంటర్ ని హత్య చేయడం నగరంలో కలకలం సృష్టిస్తుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు భరణిక రాము(35) రంగిరీజు వీధిలో ఉంటూ  స్థానికంగా కార్పెంటర్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వారం రోజులు కిందట టౌన్ కొత్త రోడ్, దీప్తి బార్ లో రాముకి, గరికిన సతీష్ మధ్య మద్యం విషయంలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో  గరికిన సతీష్, రాముని కొట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో వినాయకుని  ఊరేగింపులో రాము, మేనమామ కుంచయ్య కలిసి తిరిగి ఇంటికి ఇద్దరూ కలిసి బైక్ పై వస్తుండగా సతీష్ తన అనుచరులతో ఎటాక్ చేశాడు. వెంటనే భయపడి మేనమామ కుంచయ్య, రాముని వారి వద్ద ఒంటరిగా వదిలేసి పారిపోయాడు. దీంతో గరికిన సతీష్, అతని ఫ్రెండ్ రాజేష్, మరి కొంతమంది కలిసి సినిమా తరహాలో వేటాడి వెంటాడి రాము తల, మెడ, పొట్ట భాగంలో  కత్తులతో పొడిచి దాడి చేశారు. దీంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే రాము చనిపోయాడు. ఈ సంఘటన సరిగ్గా కేజీహెచ్ అఫీషియల్ కాలనీ మొదటి లైన్ లో జరిగింది.  

Share