Current Date: 07 Oct, 2024

మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట చెప్పినట్లుగానే పిఠాపురంలో సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. స్థానికంగా స్థలం కొని రిజిస్ట్రేషన్ కూడా‌చేయించుకున్నారు.పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాల బిట్ ఒకటి.. 2.08 ఎకరాల మరో బిట్ స్థలం తీసుకున్నారు. ఆ ఏరియాలో ఎకరం మార్కెట్‌ విలువ రూ.15-16 లక్షల మేర ఉంది. పవన్ కొనుగోలు చేసిన భూమిలోని రెండు ఎకరాల్లో క్యాంపు ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకి ముందు తాను పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటానని బహిరంగసభలో పవన్ ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా స్థలం కొనుగోలు చేసి ఇంటి నిర్మాణానికి సిద్ధమవుతున్నారు.

Share