Current Date: 06 Oct, 2024

ఆగిరిపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహం అపహరణ

చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఆగిరిపల్లి ఎగువ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉత్సవ విగ్రహాల్లో ఒకదానిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. దుండగులు ఆలయ తాళాలు పగులగొట్టి స్వామి వారి ఉత్సవ విగ్రహంతోపాటు గంటలు, వెండి పూజా సామగ్రిని ఎత్తుకెళ్లారు. ఈ విషయం ఆలయ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఉంచినట్లు భావిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు దేవ దాయ శాఖ అధికారులను ప్రశ్నించడంతో విషయం వెలుగుచూసింది. ఆలయంలో 14 సీసీ కెమేరాలు వున్నప్పటికీ ఒక్కటి కూడా పనిచేయకపోవడం గమనార్హం.ఎంతో ప్రాశస్త్యం వున్న ఆలయంలో ఉత్సవ విగ్రహం అపహరణకు గురికావడం, దీనిని ఎవరికి తెలియ కుండా గుట్టుగా వుంచడం తీవ్ర సంచలనం రేపుతోంది.

Share