Current Date: 06 Oct, 2024

పరిశ్రమల భద్రతపై చర్యలు తీసుకుంటాం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు

పరవాడ సినర్జీ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. క్షతగ్రాతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ  మరో దురదృష్టకరమైన ఘటన జరిగిందని అన్నారు. రసాయనాలు కలిపేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయని తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. గాయాలైన సూర్యనారాయణకు ధైర్యం చెప్పామని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యంతో పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.

Share