Current Date: 06 Oct, 2024

మిమ్మల్ని తిట్టినోళ్లంతా ఓడిపోయారు సార్.. రజినీ సింపుల్ రియాక్షన్

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి రజనీకాంత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కొద్దిసేపు మాట్లాడారు. ఈ క్రమంలో రజినీతో ‘సార్‌.. గతంలో మిమ్మల్ని తిట్టిన ఏపీ మంత్రులంతా ఓడిపోయారు’ అని బాలశౌరి చెప్పారట.‘గతంలో మీరు చంద్రబాబును పొగిడినప్పుడు అప్పటి ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో వారంతా ఓడిపోయారు’ అని బాలశౌరి చెప్పగా.. ‘మనకు నచ్చింది మనం మాట్లాడతాం.. దానికే తిడితే ఎలా? అలా తిట్టకూడదు కదా?’ అని రజినీకాంత్ బదులిచ్చినట్లు తెలుస్తోంది.

Share