Current Date: 07 Oct, 2024

లేడీ ఎంప్లాయిస్‌కి నెలసరి సెలవులు వారికే డేంజర్!

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతేకాదు రుతుక్రమ సెలవులు మంజూరు చేయడం వల్ల మహిళలు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంపై రాష్ట్రాలు, ఇతర భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు జరిపి మోడల్ పాలసీని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది.దేశంలోని చాలా రాష్ట్రాల్లో మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే బిహార్‌లో నెలకు రెండు రోజు సెలవు ఇస్తుండగా, కేరళలోనూ నెలకు మూడు రోజుల పాటు విద్యార్థినులకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యం మిగతా రాష్ట్రాల్లోనూ దీన్ని పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.రుతుక్రమ సెలవులు మంజూరు చేయడం వల్ల మహిళలు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సెలవులు ఇవ్వడం వల్ల ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, కానీ యాజమాన్యాలను ఈ సెలవులు ఇవ్వాల్సిందేనని బలవంతం చేయడం వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది.

Share