Current Date: 07 Oct, 2024

వసంత కెమికల్ కంపెనీలో అగ్నిప్రమాదం

అచ్యుతాపురం సెజ్ లో బుధవారం ఉదయం వసంత కెమికల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలో రియాక్టర్ పేలుపోవడంతో భారీ మంటలు చెలరేగాయి. ఒకరి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఒకరికి గాయాలు కారణంగా అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.  కంపెనీలో పనిచేసిన  ఉద్యోగులు సురక్షితంగా ఉన్నారో లేదో మరి ఇంకెవరికైనా  ప్రమాదం జరిగిందా అనే  ఆరోపణలు వినిపిస్తున్నాయి.  రాంబిల్లి సీఐ నర్సింగరావు, తహసిల్దార్ జరిగిన సంఘటనపై యాజమాన్యంతో పేలుడుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

Share