Current Date: 01 Oct, 2024

సైలెంట్ అయిపోయిన వేణుస్వామి.. కానీ ఆయన భార్య తెరపైకి!

జ్యోతిష్కుడు వేణు స్వామి భార్య శ్రీవాణి సైతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవల వేణు స్వామిపై కేసు నమోదైన సమయంలోనూ.. తన వీడియో ద్వారా వైరల్ అయ్యారు శ్రీవాణి. భర్తకు మద్దతుగా వీడియో రిలీజ్ చేసి.. ఘాటుగా రియాక్టైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో విషయంలో వేణు స్వామి భార్య శ్రీవాణి వీడియో రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం ఏమిటంటే తిరుమల లడ్డూ వ్యవహారం. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఇక ఈ విషయంపైనా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. సోమవారం ఆ పిటిషన్ మీద సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో.. వేణు స్వామి భార్య శ్రీవాణి స్పందించారు. ‘‘పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు. ప్రజలు, భక్తుల మనోభావాలను హింసించేశారు. రాజకీయ నాయకులను పక్కన బెడితే.. ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఏమన్నా ఓవర్ యాక్టింగ్ చేశారా..? ప్రాయశ్చిత్త శ్లోకాలు వారే కనిపెట్టేసి.. వాటిని చెప్పించేసి, ఏమన్నా రచ్చ చేశారా? మీరు నిజమైన హిందువులైతే.. వెంకటేశ్వరస్వామి భక్తులైతే. మమ్మల్ని క్షమించండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా?" అంటూ శ్రీవాణి మండిపడ్డారు. శ్రీవాణి ఇండైరెక్ట్‌గా కూటమి నేతల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్లు కనిపిస్తోంది.

Share