Current Date: 06 Oct, 2024

జవహర్‌ రెడ్డి కారు డ్రైవర్‌గా ఐఏఎస్‌ అధికారి సాయి కాంత్‌ వర్మ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి అతి రహస్యంగా జరిగిన విశాఖ పర్యటనలో ఆయన కారు డ్రైవింగ్‌ చేసిందెవరు? సాధారణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో అధికారిక పర్యటన చేస్తున్నారంటే క్యాబినెట్‌ మంత్రికి మించిన ఏర్పాట్లు వుంటాయి. కానీ ఎన్నికల కోడ్‌ వుండగానే మే 20వ తేదీన జవహర్‌ రెడ్డి విశాఖ వచ్చారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల సమీక్ష కోసం వచ్చానని నమ్మబలికారు. అయితే జవహార్‌ రెడ్డి గుట్టుగా విశాఖ రావడానికి  కారణం తన  బినామీలకు ఫ్రీ హోల్డ్‌ చేయించుకున్న 800 ఎకరాల అసైన్డ్‌ భూములను చూసుకోవడానికిమాత్రమేననఆరోపణలువచ్చాయి.ఈభూముల్నిచూసుకోవడానికి వెళ్లే క్రమంలో తన అధికారికి సిబ్బందిని ఎవరినీ రావద్దన్నారట. అంతేకాదు అధికారిక డ్రైవర్‌ని కూడా దించేశారట. కారు డ్రైవర్‌గా జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ వ్యవహరించారట.