Current Date: 07 Oct, 2024

పగోజిలో పాడి గేదెపై అత్యాచారం కలెక్టర్‌ సీరియస్

ఆంధ్రప్రదేశ్‌లో గత 10 రోజుల అత్యాచారాలపర్వం నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా.. మైనర్లపై అఘాయిత్యాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఓ పాడి గేదెపై అత్యాచారం చేశారు దుర్మార్గులు.ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రివేళ పశువుల కొట్టంలో ఉన్న గేదె వద్దకు వచ్చి, దాన్ని పడగొట్టి, కదలకుండా కాళ్లను తాళ్లతో బంధించి అత్యాచారం చేశారని రైతు సీతారామయ్య ఫిర్యాదు చేశారు. అత్యాచార సమయంలో గేదెకి వెనుక వైపు అయిన గాయాలను గోరు గాట్లను కూడా పోలీసులకు, మీడియాకు రైతు చూపించారు. గంజాయి మత్తులో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.ఘటన జరిగి వారం రోజులు గడిచినా పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో జిల్లా కలెక్టర్‌‌ను కలిసి రైతు ఫిర్యాదు చేశారు. దాంతో స్పందించిన కలెక్టర్ దర్యాప్తు చేసి, చర్యలు తీసుకోవాల్సిందిగా వీరవాసరం పోలీసులను ఆదేశించారు.

Share