Current Date: 05 Oct, 2024

వెంటిలేటర్‌పై ‘ఈనాడు’ రామోజీ!

 ఈనాడు దినపత్రిక ఎడిటర్‌ చెరుకూరి రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని స్టార్‌ హాస్పిటల్‌కు తరలించారు. కొన్నాళ్లగా ఆయన అనారోగ్యతో బాధపడుతున్నవిషయంతెలిసిందే.ఇటీవలేఆయనకువైద్యులు స్టంట్‌ వేశారు. శుక్రవారం రాత్రి ఆయన పరిస్థితి మరింత దారుణంగా తయారైందని వైద్యులు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రామోజీ పేరుతెలియనివారుండరు.వ్యవసాయదారుడిగా,జర్నలిస్టుగా,పారిశ్రామిక వేత్తగా, సినీనిర్మాతగా ఆయన దేశంలోనే పేరొందారు. 40ఏళ్ల క్రితం విశాఖవేదికగా ఈనాడు దినపత్రికను ప్రారంభించి ఏపీలోనే అత్యధిక సర్క్యులేషన్‌ కలిగినపత్రికగా ఆయన దానిని తీర్చిద్దిద్దారు. ప్రయోగాలకు ఆయన పెట్టిందిపేరు. ప్రియా పచ్చళ్లు, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌, ఆతిథ్య రంగంలో పేరు గాంచి ఆనకు దేశంలోనే పేరొందిన రామోజీ ఫిల్మ్‌ సిటీని ఆయన నిర్మించి అనేక వర్గాల నుంచి పేరొందారు.