Current Date: 05 Oct, 2024

చంద్రబాబుని గంగూలీతో పోల్చిన అర్నాబ్ గోస్వామి

ఏపీలో ఎన్నికల ఫలితాల ముంగిట చంద్రబాబు గురించి రిపబ్లిక్ టీవీ అధినేత, సీనియర్ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.సాధారణంగా రాజకీయ ఇంటర్వ్యూల్లో నేతల్ని తీవ్రంగా విమర్శించే గోస్వామి.. అనూహ్యరీతిలో చంద్రబాబుని మెచ్చుకున్నారు. అది కూడా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో పోలుస్తూ పొగడ్తల వర్షం కురిపించారు.‘‘చంద్రబాబుని క్రికెటర్లు ఎవరితోనైనా పోల్చాల్సి వస్తే అది సౌరబ్ గంగూలీ తో పోల్చుతాను.. ఎందుకంటే మన బ్యాటింగ్ ఎదుటి పక్షం వీరవిహారాన్ని తట్టుకోలేక కుప్పకూలిపోతుంటే "మ్యాన్ ఆఫ్ ది క్రైసిస్‌"గా వచ్చి ధీరోదత్తంగా బ్యాటింగ్ చేసి మన టీం‌మ్‌ని విజయతీరాలకి తీసుకెళ్ళేవాడు.. చంద్రబాబు కూడా అంతే..‌ ప్రభుత్వం జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో పగ్గాలు తీసుకొని దేశమే అసూయ పడే విధంగా అభివృద్ధి చేస్తాడు.. ఆయన ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి ఇదే జరిగింది.. అందుకే నేనంటాను చంద్రబాబు యావత్తు తెలుగుజాతికి మ్యాన్ ఆఫ్ క్రైసిస్’’ అని అర్నాబ్ గోస్వామి చెప్పుకొచ్చారు.