Current Date: 07 Oct, 2024

సింహాచలంలో ఆర్జిత సేవలు రద్దు

ఆషాడ పౌర్ణమి పురష్కరించుకొని ఈ నెల 20, 21 తేదీల్లో సింహాచలంలో జరిగే సుప్రభాత సేవ, ఆరాధన, నిత్య కళ్యాణం, అష్టోత్తరం, సహాస్ర నామార్చన వంటి ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారు. ఈ తేదీలలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి దర్శనానికి తరలి రానున్న నేపద్యంలో నీలాద్రి ద్వారం నుంచి మాత్రమే దర్శనాలకు ఆనుమతిస్తున్నట్లు ఆలయ ఆధికారులు తెలిపారు.

Share