Current Date: 05 Oct, 2024

జీవీఎంసీ ఆకృతులు ధ్వంసం

కోట్లాది రూపాయల ఖర్చుతో జీవీఎంసీ  ఇటీవల నగరంలోని వివిధ కూడళ్ళలో సుందరీకరణ పనులు చేపట్టారు. అయితే నగరానికి సంబంధం లేని, ఆ ప్రాంతంతో ముడిపడని ఆకృతుల్ని ఏర్పాటు చేశారు. అయితే కొత్త ప్రభుత్వం ఇంకా కొలువు తీరకముందే  ఆయా ఆకృతల్ని సిబ్బంది ధ్వంసం చేశారు. డెయిరీ ఫారం కూడలిలో శనివారం ఉదయం గత ఆకృతుల్ని ధ్వంసం చేసేశారు. ఇంతకీ వాటిని ఎందుకు ధ్వంసం చేస్తున్నారు, నగరంలో ఉన్న అన్నింటినీ తీసేసి, అలాగే చేస్తారా..ఈ ఖర్చు ఎవరిపై భారం పడుతుంది, ఎందుకిలా చేస్తున్నారన్న ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానం రావాలి.